AKP: జిల్లాలో రేపటి నుంచి జరిగే పదవ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈవో అప్పారావు నాయుడు తెలిపారు. 21,016 మంది విద్యార్థులు పరీక్షలు రాయడానికి 102 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు అరగంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రానికి 100 మీటర్ల దూరంలో ఉన్న జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఆదేశించారు.