RR: మంచాల మండలం ఆరుట్లలో ముస్లిం సోదరులకు మార్కెట్ కమిటీ సభ్యులు సాత్రి ఎలిషా ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ.. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు ఎంతో నియమ నిష్టలతో ఉపవాస దీక్షలు చేస్తారని, ఇవి సమాజానికి మేలు చేకూరుస్తాయని పేర్కొన్నారు. ముస్లిం సోదరులంతా ఆనందోత్సవాలతో పండుగ జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.