కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో శనివారం భక్తులు చేసిన వివిధ సేవల ద్వారా రూ.4,48,633 ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 747 మంది స్వామివారిని దర్శించుకున్నారని, 38 ద్విచక్ర వాహనాలకు పూజలు నిర్వహించారని, 3281 మంది అన్న ప్రసాదం స్వీకరించారని పేర్కొన్నారు.