ATP: శెట్టూరు మండలంలో విధులకు గైర్హాజరైన 104 మంది గ్రామ సచివాలయ సిబ్బందికి ఎంపీడీవో జిలానీబాషా శనివారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలైనా కార్యాలయాలకు రాకపోవడం, సర్వేలపై నిర్లక్ష్యం వహించడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు, ఏఎన్ఎంలు, మహిళా పోలీసులకు నోటీసులు ఇచ్చారు.