AP: పార్వతీపురం మన్యం జిల్లాలో టమోటా ధరలు భారీగా పడిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 28 కిలోల టమోటా కేసును వ్యాపారులు రూ.120 నుంచి రూ.150కే కొనుగోలు చేస్తున్నారు. ఖర్చులతో పోలిస్తే ఈ ధరలు చాలా తక్కువగా ఉండటంతో పెట్టుబడులు కూడా రావడం లేదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాలూరు మండలంలో సుమారు 300 ఎకరాల వరకు టమోటా పంటను సాగు చేస్తున్నారు.