WGL: జిల్లా కేంద్రంలో శనివారం రాష్ట్ర మంత్రి కొండా సురేఖను దేవాదాయ శాఖ డైరెక్టర్ హనుమంత రావు, భద్రాచలం ఆలయ ఈవో సురేఖ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఈనెల 27న శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో వైభవంగా నిర్వహించనున్న తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు మంత్రి రావాలని ఆహ్వాన పత్రం అందజేశారు. ఈ సందర్భంలో ఆలయ అర్చకులు ఉన్నారు.