GNTR: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూరవిద్య కేంద్రం ఆధ్వర్యంలో ఈ నెల 15న జరిగే ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశ పరీక్షలకు సర్వం సిద్ధమైందని డైరెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసిన వారు ఆదివారం మధ్యాహ్నం 12 గంటల లోపు పత్రాలను పూర్తి చేయాలని సూచించారు. దరఖాస్తు చేయని వారు నేరుగా పరీక్షా కేంద్రానికి వెళ్లి రూ. 500 తత్కాల్ ఫీజు చెల్లించాలన్నారు.