AP: రాష్ట్రంలో మంత్రులపై జరుగుతున్న దారుణాలపై వైసీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి మండిపడ్డారు. తాడేపల్లిలో ఆమె మాట్లాడుతూ.. ‘కూటమి అధికారంలోకి వచ్చాక మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయని చెప్పారు. మహిళలపై ఎమ్మెల్యేలే అత్యాచారాలు చేస్తున్నారంటూ విమర్శించారు. పాపాలను పంచుకోవడంలో జనసేన కూడా భాగం పంచుకుంటోంది’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.