WGL: గాంజాయి మత్తులో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. మత్తుకు బానిసైన యువకుడు మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని శంభునిపేటలో బీభత్సం సృష్టించాడు. మత్తు పదార్థాలు తమ ఇంటి ప్రాంతంలో సేవించవద్దని చెప్పిన వారిపై ఇనుప రాడ్డుతో దాడి చేశాడు. దీంతో భయభ్రాంతులకు గురైన స్థానికులు పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.