ALR: జిల్లా పోలవరం మండలంలో ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడింది. 2024లో జరిగిన ఈ ఘోర ఘటనపై విచారణ చేపట్టిన ఏలూరు పోక్సో కోర్టు జడ్జి మల్లికార్జునరావు నిందితుడు తమ్మన బోయిన రామకృష్ణను దోషిగా తేల్చారు. నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ. 5 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.