MBNR: మిడ్జిల్ మండలంలో శనివారం పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొత్తం 341 మంది విద్యార్థులకు గాను 339 మంది హాజరయ్యారని ఎంఈవో సరస్వతి తెలిపారు. ZPHS (బాలుర) కేంద్రంలో 198 మందికి 197 మంది, చైతన్య భారతి స్కూల్లో 143 మందికి 142 అందరూ హాజరయ్యారు. మొత్తంగా ఇద్దరు విద్యార్థులు గైర్హాజరైనట్లు ఎంఈవో పేర్కొన్నారు.