GDWL: వ్యర్థాలను రోడ్లపై వేసి ఆరోగ్య సమస్యలను, దోమల బెడదను కొని తెచ్చుకోవద్దు అని కౌన్సిలర్లు తిరుమలేష్, పాగుంట సువర్ణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అయిజ మున్సిపాలిటీలో ప్రజాపాలన 99 రోజుల ప్రణాళికలో భాగంగా 1వ, 12వ వార్డుల్లో శనివారం ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం చేపట్టారు. తడి, పొడి చెత్తను వేరువేరుగా సేకరించి మున్సిపాలిటీ వాహనాల ద్వారా తరలించారు.