KNR: శంకరపట్నం మండలం వంకాయగూడెంలో నిర్మించిన వైకుంఠధామం నాణ్యతా లోపంతో కూలిపోయే స్థితికి చేరింది. గత పాలకులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్లే ఈ దుస్థితి దాపురించిందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. మృతదేహాల ఖననానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, జిల్లా అధికారులు స్పందించి తక్షణమే మరమ్మతులు చేపట్టి వాడుకలోకి తీసుకురావాలని వారు డిమాండ్ చేస్తున్నారు.