కోనసీమ: అంబాజీపేట మార్కెట్ యార్డ్లో నిర్వహించిన పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేస్తున్నాయని, ముఖ్యంగా పీఎం కిసాన్ పథకం ద్వారా 23,796 మంది రూ.13.82 కోట్లు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు.