TPT: గ్యాస్ కొరతల నేపథ్యంలో తిరుపతిలో అధికారులు తనిఖీలు నిర్వహింస్తున్నారు. ఈ క్రమంలో సదరన్ స్పైస్ హోటల్ సమీపంలోని శ్రీబాలాజీ కోఆపరేటివ్ భారత్ గ్యాస్ గోడౌన్కు అనుమతులు లేవని గుర్తించారు. అక్రమంగా నిల్వ ఉంచిన 592 కమర్షియల్, 230 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల(మొత్తం 822)ను స్వాధీనం చేసుకున్నారు. గోడౌన్ నిర్వహణకు అనుమతి లేకపోయినా నిర్వహిస్తున్నారని అధికారులు తెలిపారు.