TG: రాష్ట్రంలోని బాసర, మహబూబ్నగర్ ట్రిపుల్ ఐటీ క్యాంపస్లలో ప్రవేశాలకు షెడ్యూల్ విడుదలైంది. ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాల షెడ్యూల్ను ఆర్జీయూకేటీ బాసర వీసీ గోవర్దన్ విడుదల చేశారు. మార్చి 16న నోటిఫికేషన్, మార్చి 18 నుంచి మే 10వ తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగనుంది.