NTR: వీరులపాడు మండల పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం నుంచి ‘నో హెల్మెట్-నో ఎంట్రీ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎస్సై అభిమన్యు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనం నడిపితే రూ.1000 జరిమానా విధిస్తామని చెప్పారు. రోడ్డు ప్రమాదాలు కుటుంబాలను అతలాకుతలం చేసే ప్రమాదం ఉన్నందున తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఆయన ప్రజలకు సూచించారు.