CTR: అన్నదాత సుఖీభవ-PM కిసాన్ 3వ విడతలో భాగంగా నగరి నియోజకవర్గంలోని 20,063 మంది రైతులకు రూ.11.27 కోట్లు చెక్కును నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ శుక్రవారం రైతులకు అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా దేశంలో ఎక్కడా లేనివిధంగా అన్నదాత సుఖీభవ కింద ప్రతీ రైతుకు ఏడాదికి రూ.20,000 ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు.