KNR: హుజూరాబాద్ పట్టణంలో ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతోంది. మున్సిపల్ ఛైర్ పర్సన్ రొంటాల సుహాసిని, కమిషనర్ సయ్యద్ ముసబ్ అహ్మద్ ఆధ్వర్యంలో శుక్రవారం నీటి ట్యాంకుల శుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం పలు వార్డుల్లో పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు.