SRPT: తుంగతుర్తి మండలం అన్నారంలో గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని శనివారం సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. పశుపోషకులు నిర్లక్ష్యం చేయకుండా తమ పశువులకు టీకాలు వేయించాలని కోరారు. ఈ వ్యాధి సోకితే పశువులలో పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతుందని, ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు.