ASR: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాడేరు పర్యటనకు వచ్చే ముందే హైడ్రో పవర్ ప్రాజెక్టు జీవోలు-2, 13, 51లను రద్దు చేయాలని గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ డిమాండ్ చేశారు. శుక్రవారం అరకులో మీడియాతో మాట్లాడారు. హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణం వల్ల గిరిజనులకు నష్టం జరుగుతుందన్నారు. ఆదివాసీ ప్రాంతంలో 100శాతం రిజర్వేషన్ చట్టం చేయాలన్నారు.