WGL: భారతీయ జనతా పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని BJP రాష్ట్ర నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు అన్నారు. ఖిలావరంగల్ మండలంలో శుక్రవారం BJP శ్రేణులకు శిక్షణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ప్రదీప్ రావు పాల్గొని కార్యకర్తలకు సూచనలు చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.