VKB: రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఉపాధ్యాయుల సమస్యలపై చర్చించి, వాటి పరిష్కారానికి కృషి చేయాలని టీపీయూఎస్ (TPUS) నేతలు విజ్ఞప్తి చేశారు. తాండూర్లోని క్యాంపు కార్యాలయంలో ఇవాళ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని కలిసి జిల్లా ప్రధాన కార్యదర్శి గాజుల బస్వరాజ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆనందం వినతిపత్రం అందజేశారు. తక్షణమే వేతన సవరణ చేయాలని వారు డిమాండ్ చేశారు.