TG: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే కోండిగారి రాములు(80) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో ఆయన మరణించారు. 1989, 1994లో రెండు పర్యాయాలు సీపీఎం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. బీసీ సంక్షేమశాఖ శాసనసభ కమిటీ సభ్యుడిగానూ పనిచేశారు. ఆయన మృతితో ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.