GDWL: జిల్లాలో రేపటి నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి వార్షిక పరీక్షలకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లా వ్యాప్తంగా 40 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశారు. 187 ఉన్నత పాఠశాలల నుంచి సుమారు 8057 మంది విద్యార్థులు ఈ ఏడాది పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు అందజేశారు.