TPT: పిచ్చాటూరు మండలం హనుమంతపురం గ్రామంలో ఇటీవల దొంగతనాలు పెరుగుతున్నాయని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయంలో పోలీస్ బీట్ ఏర్పాటు చేసి గస్తీ నిర్వహించాలని వారు కోరుతూ నిన్న పిచ్చాటూరు ఎస్సై రాఘవేంద్రకు వినతి పత్రం అందజేశారు. గ్రామ భద్రత కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు.