CTR: విజయపురం(మం) శ్రీహరిపురం, జంబడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఐసీడీఎస్ పర్యవేక్షకులు శ్యామల ఆధ్వర్యంలో బాల్య వివాహలపైన అవగాహన కార్యక్రమం గురువారం నిర్వహించారు. చిన్న వయస్సులో పెళ్లి చేసుకొని జీవితాలను నాశనం చేసుకోరదని, పొక్సో, శిశు లింగ నిర్దారణ చట్టాలపైన శ్యామల అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసలు, దొరస్వామి పాల్గొన్నారు.