KNR: ఈనెల 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరగనున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు రామడుగు మండలంలో ఏర్పాట్లు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. మండలం నుంచి మొత్తం 635 మంది విద్యార్థులు హాజరుకానుండగా, అందులో 386 మంది బాలురు, 249 మంది బాలికలు ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి 225 మంది, ఐదు ప్రైవేటు పాఠశాలల నుంచి 410 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు.