AP: సాగర్ డిఫెన్స్ ఇంజినీరింగ్ పరిశ్రమ రాష్ట్రానికి రావడం ఆనందంగా ఉందని మంత్రి లోకేష్ అన్నారు. నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నెలో సాగర్ డిఫెన్స్ ఇంజినీరింగ్ పరిశ్రమకు లోకేష్ శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఈ పరిశ్రమ వల్ల 25 వేల మత్స్యకార కుటుంబాలకు లబ్ధి జరుగుతుందని చెప్పారు. మత్స్యకార కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు.