E.G: ప్రజారోగ్యమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా నగరంలో గురువారం మొత్తం 64 మంది లబ్ధిదారులకు సుమారు రూ. 42,89,541 విలువైన ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ (CMRF) చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం తాజా రాజకీయ పరిణామాలపై కూటమి నాయకులతో చర్చించారు.