జమ్మూలో మరో రెండు రోజుల పాటు పలుచోట్ల హిమపాతంతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఉత్తర కాశ్మీర్లోని బారాముల్లా, కుప్వారా, దక్షిణ కాశ్మీర్లోని పహల్గామ్లతో పాటు శ్రీనగర్లోనూ వర్షాలు కురుస్తున్నాయని వెల్లడించింది. నిన్న కుప్వారాలో 6.4 మి.మీ వర్షపాతం నమోదైందని, జోజిలా, జాంస్కర్లలో హిమపాతం నమోదైందని పేర్కొంది.