BHPL: స్తంభంపల్లి గ్రామంలో ఇవాళ విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికురాలైన లక్ష్మి (40) తన భర్తకు నిన్న గొడవ జరిగింది. దీంతో మనస్థాపానికి గురై లక్ష్మి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలు తల్లి ఫిర్యాదు మేరకు SI మహేందర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.