KMR: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో గ్రామాలు, పట్టణాల సమగ్ర అభివృద్ధి సాధ్యమని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. నేడు పట్టణంలోని కళాభారతి ఆడిటోరియంలో నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడంతో పాటు గ్రామాలు, పట్టణాల సమగ్ర అభివృద్ధి కోసం “ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక” కార్యచరణ ప్రణాళికను అమలు చేశామన్నారు.