NLR: 10వ తరగతి ప్రశ్నాపత్రాలు బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్కు చేరుకున్నాయి. ప్రశ్నాపత్రాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి భద్రపరిచారు. ఈ సందర్భంగా ఎంఈవో-2 మాట్లాడుతూ.. మండల పరిధిలో ఏడు పరీక్ష కేంద్రాలలో 1041 మంది పరీక్షలు రాయనున్నారని తెలిపారు. విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు.