MNCL: బీజేపీ తెలంగాణ మీడియా ప్యానలిస్టుగా మంచిర్యాలకు చెందిన అడ్వకేట్ తులా ఆంజనేయులు నియమితులయ్యారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆంజనేయులు విద్యార్థి ఏబీవీపీ, బీజేవైఎంలో అనేక పదవులు నిర్వహించారు. తెలంగాణ మీడియా ప్యానలిస్టుగా నియమించడం చాలా ఆనందంగా ఉందని ఆయన తెలిపారు.