W.G: తణుకు సొసైటీ రోడ్డులోని వైయస్సార్ పార్క్ వద్ద మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి మరమ్మతులు చేపట్టాలని ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ డిమాండ్ చేశారు. గురువారం మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. వైయస్సార్ పార్కు బోర్డు సైతం శిథిలావస్థకు చేరిందని తక్షణమే మున్సిపల్ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.