BDK: భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఇవాళ జరిగింది. ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, తహసీల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అనంతరం పట్టణంలోని 42 కుటుంబాలకు రూ. 42,04,872 విలువగల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.