SRCL: బోయినపల్లి మండలం స్థంభంపల్లి గ్రామంలోని గంజివాగు హై లెవల్ బ్రిడ్జి చివరి దశ పనులను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. బ్రిడ్జి పూర్తయితే ప్రజలకు రాకపోకలు సులభమవుతాయని ఎమ్మెల్యే తెలిపారు. వారి వెంట అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.