MNCL: మంచిర్యాల- పెద్దంపేట రైల్వే స్టేషన్ల మధ్య బుధవారం రాత్రి రైలు ఢీకొని ఓ యువకుడు మృతి చెందాడు. మృతుని వయసు 25 నుంచి 30 ఏళ్లు ఉండగా.. పడిగల రజనీ కాంత్, మల్కపల్లి గ్రామం అనే చిరునామా కలిగిన ఆధార్ కార్డు లభ్యమైంది. ముఖం నుజ్జు నుజ్జు కావడంతో గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహం ఉంది. జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ సంపత్ కేసు చేసి దర్యాప్తు చేస్తున్నారు.