WGL: గీసుకొండ మండలం కొమ్మాల లక్ష్మి నరసింహస్వామి జాతరలో మొత్తం ఆదాయం రూ. 21,22,410 వచ్చినట్లు ఆలయ ఈవో ఉగాది ప్రసాద్ తెలిపారు. దేవాదాయశాఖ పర్యవేక్షకుడు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది ఆలయంలోని హుండీల, శీఘ్ర దర్శనం, ప్రత్యేక దర్శనాలు, కేశ ఖండనం ద్వారా వచ్చిన ఆదాయాన్ని లెక్కించారన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచి యమున, తదితరులు పాల్గొన్నారు.