SKLM: వైసీపీ ఆవిర్భావ దినోత్సవం గురువారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ మేరకు బుధవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. 15 ఏళ్లలో పార్టీ ఎన్నో సవాళ్లను అధిగమించిందన్నారు. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో చెరగని ముద్ర వేసిందన్నారు.