BHPL: రైతు భరోసా నిధులు విడుదల చేయాలని, సన్న వడ్ల బోనస్ వెంటనే రైతుల అకౌంట్లో జమ చేయాలని డిమాండ్ చేస్తూ మహాముత్తారం మండల కేంద్రంలో బీజేపీ నేతలు బుధవారం ధర్నా రాస్తారోకో నిర్వహించారు. కాంగ్రెస్ నేతలు పూటకు ఒక అబద్దం చెబుతూ.. కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. లేదంటే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున నిరసన చేపడుతామని హెచ్చరించారు.