BDK: బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన రైతు దారం వెంకటేశ్వర రెడ్డి ఏర్పాటు చేసిన ఆర్గానిక్ బొప్పాయి తోటను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు బుధవారం సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రసాయనాలు ఉపయోగించకుండా ఆర్గానిక్ విధానంలో పంటలు సాగు చేయడం ద్వారా ఆరోగ్యకరమైన ఆహారం అందించడంతో పాటు రైతులకు మంచి ఆదాయం లభిస్తుందని తెలిపారు.