KMM: మధిర బార్ అసోసియేషన్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ బుధవారంతో ముగిసింది. ఎన్నికల అధికారి, సీనియర్ న్యాయవాది చింతల గోపాల్ వివరాలు వెల్లడించారు. అధ్యక్ష పదవికి రామరాజు, రమేష్తో పాటు చివరి రోజు పుల్లారావు, కృష్ణారావు నామినేషన్ దాఖలు చేయడంతో మొత్తం నలుగురు పోటీలో ఉన్నారు. ఇతర పదవులకు కూడా పలువురు నామినేషన్లు దాఖలు చేశారు.