SRD: సంగారెడ్డి పట్టణ ప్రజలు తమ ఇళ్ల వద్ద తడి, పొడి, హానికర చెత్తను వేరువేరుగా వేసి మున్సిపల్ సిబ్బందికి అందించాలని కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి కోరారు. ఇలా చెత్తను వేరు చేయడం వల్ల ప్రాసెసింగ్ సులభమవుతుందన్నారు. ప్రజలు మార్కెట్కు వెళ్లే సమయంలో ప్లాస్టిక్ కవర్లను విడిచి, పర్యావరణ హితమైన సంచులను వాడాలని సూచించారు.