BDK: మణుగూరు మండలంలోని కూనవరం గ్రామపంచాయతీ నూతన భవన నిర్మాణానికి రూ.20 లక్షల అంచనా వ్యయంతో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు బుధవారం శంకుస్థాపన చేశారు. గ్రామ ప్రజలకు మెరుగైన పరిపాలన సేవలు అందించేందుకు ఈ నూతన భవనం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, మౌలిక సదుపాయాల కల్పనకు నిరంతరం కృషి చేస్తుందన్నారు.