ATP: గుత్తి మున్సిపాలిటీ కౌన్సిల్ హాల్లో గుత్తి కోట ఉత్సవాలపై మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మెప్మా పీడీ విశ్వ జ్యోతి హాజరయ్యారు. వారు మాట్లాడుతూ.. ఈనెల 14, 15 తేదీల్లో జరిగే కోట ఉత్సవాలలో మహిళా సంఘాల సభ్యులను హాజరయ్యేలా ఆర్పీలకు ఆదేశాలు ఇచ్చారు. ప్రతి ఒక్కరు కోట ఉత్సవాలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.