JGL: కలెక్టర్ సత్యప్రసాద్ మంగళవారం రాయికల్ మండలం ఇటిక్యాల ZPHS పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన పథకం అమలు విధానం, వంట గదిని పరిశీలించారు. పదవ తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. విద్యార్థులు ఏకాగ్రతతో చదివితే ఆశించిన ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు.