KRNL: కృష్ణగిరి మండలం బస్సులో రూ.25 లక్షల నగదు చోరీ చేసిన ఉత్తరప్రదేశ్కు చెందిన మహమ్మద్ షహీద్ సుహేబ్లకు నిన్న కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. వ్యసనాలకు అలవాటు పడి ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. గతేడాది అక్టోబర్ 26న HYD నుంచి గుత్తికి వెళ్తున్న వ్యాపారి ప్రవీణ్ రావల్ నగదు సంచిని దొంగిలించగా, పోలీసులు నిందితులను పట్టుకుని నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు.