AP: అమరావతిలో గవర్నర్ బంగ్లా, దర్బార్ హాల్ నిర్మాణ బిడ్లకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాజధానిలో 5 కొత్త కంపెనీలకు, విరూపాక్ష ఆర్గానిక్స్కు 100 ఎకరాల కేటాయింపుకు ఓకే చెప్పింది. రిలయన్స్ కన్జ్యూమర్ యూనిట్కు ప్రత్యేక రాయితీలు ఇవ్వనున్నారు. వైజాగ్-చెన్నై కారిడార్ పనులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని మంత్రి పార్థసారథి తెలిపారు.